తప్పుల తడకగా ఓటరు జాబితా | A transparent voter list must be prepareds says ysrcp | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా ఓటరు జాబితా

Jun 18 2026 3:53 AM | Updated on Jun 18 2026 3:53 AM

A transparent voter list must be prepareds says ysrcp

సవరించకపోతే న్యాయపోరాటం

అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారకూడదు

పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలి

వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

60 ఏళ్లుగా ఉన్న ఇల్లే మాయం: మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష

2002లో ఎమ్మెల్యేగా చేసిన నా పేరే లేపేశారు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి

వైఎస్సార్‌సీపీ ఓట్లను ఏరివేసేందుకు ‘సర్‌’ ముసుగులో కూటమి పచ్చ కుట్రలు

అధికారుల ఏకపక్ష వైఖరిపై కోర్టుకు వెళ్తామన్న వైఎస్సార్‌సీపీ నేతలు

కడప కార్పొరేషన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ముసుగులో వైఎస్సార్‌సీపీ ఓట్లను గంపగుత్తగా తొల­గించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘు­రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవా­రం కడపలో విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌లో ఉంచిన ఓటరు జాబితాలోని ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు. తప్పు­లను సవరించకపోతే న్యాయ పోరాటం చేస్తా­మని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీ తొ­త్తు­లుగా మారకుండా,  పారదర్శక­మైన ఓటరు జాబి­­తాను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నా­రు.

నా డోర్‌ నంబరే లేదు: అంజద్‌ బాషా
కడపలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ వీధిలో ఉన్న డోర్‌ నంబర్‌ 19/420 ఇంటిలో నేను 60 ఏళ్లుగా ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే. 30 ఏళ్లుగా ఇదే చిరునామాపై ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. 2005లో కార్పొరే­టర్‌గా, 2014, 2019లో రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచి డిప్యూటీ సీఎంగా సేవలు అందించాను. అలాంటి నా డోర్‌ నంబరే ఓటరు లిస్టులో లేదు. 

జాబితాలో 19/417 నుంచి 19/425 వరకు అసలు డోర్‌ నంబర్లే గల్లంతు చేశారు. మా లాంటి ప్రజాప్రతినిధుల ఇళ్లను, ఓట్లనే మాయం చేస్తే ఇక సామాన్య ఓటరు పరిస్థితేమిటి? ఒక్కో పోలింగ్‌ బూత్‌లో కనీసం 50 ప్రతిపక్ష ఓట్లను తగ్గించాలనే దుర్బుద్ధితోనే ఈ అస్తవ్యస్త జాబితాను తెచ్చారు. బీఎల్‌ఓలు దరఖాస్తు ఫారాలు ఇళ్ల వద్ద పడేసి వెళ్తున్నారే తప్ప వాటిని ఎలా నింపాలో ప్రజలకు చెప్పడంలేదు. తక్షణమే ఈ తప్పుల తడక జాబి­తాను సవరించకపోతే న్యాయపోరాటం చేస్తాం.

2002లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరు లేదు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి
2002లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా ప్రస్తు­త ఓటరు జాబితాలో నా పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. నా స్వగ్రామమైన చాపాడు మండలం నక్కలదిన్నెలో 2002 ఓటరు లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, ఆ జాబితాలో నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లుగానీ, కనీసం మా గ్రామస్తుల పేర్లు­గానీ ఎక్కడా లేవు. నక్కలదిన్నె లిస్టులో రాజు­పాలెం గ్రామానికి చెందిన వారి పేర్లను చొప్పించి తారుమారు చేశారు.

వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వచ్చిన పోలింగ్‌ బూత్‌లను టార్గెట్‌ చేసి ఓటర్లను తగ్గించడమే వీరి లక్ష్యం. నక్కలదిన్నె గ్రామంలో 2014లో 6,200 ఓట్లు, 2019 నాటికి 8,400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ అక్రమంగా ఏరివేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అధికారులకు ఈ తప్పులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశీ మద్యం విక్రయాలకు అనుమతి లేదు.  

» ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంట­ల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. 
»   విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌ల్లో ఏర్పాటు చేసే బీచ్‌ బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్‌ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్‌ గడువుగా 
నిర్ణయించారు.  
»  లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసే వారు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజుతోపాటు రూ.10వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్‌ ట్యాక్స్‌(ఆర్‌ఈటీ) మొదటి ఏడాది రూ.7.50లక్షలు చెల్లించాలి. ఆర్‌ఈటీ ఏటా 10శాతం పెంచుతారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement