
భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని..
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ వివాహితను భార్య, ఆమె బంధువులు కలిసి చితకబాదారు.
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ వివాహితను భార్య, ఆమె బంధువులు కలిసి చితకబాదారు. ఈ ఘటన మండల పరిధిలోని తమ్మరబండపాలెం అవాస గ్రామం అల్వాలపురంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గురుస్వామి, సత్యవతి దంపతులు. గురుస్వామి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన సత్యవతి పెద్ద మనుషులను ఆశ్రయించడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. ఇటీవల గురుస్వామి మళ్లీ ఆ వివాహిత వద్దకు వెళ్తుండటంతో సత్యవతి, ఆమె బంధువులు కలిసి వెళ్లి సదరు వివాహితను చితకబాదారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె బంధువులు కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివాహిత బంధువు తెలిపారు.