ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెట్టి యువతను ప్రోత్సహించాలన్నారు.
'క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు'
Aug 22 2016 2:20 PM | Updated on Sep 19 2019 8:28 PM
హైదరాబాద్: ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెట్టి యువతను ప్రోత్సహించాలన్నారు. సోమవారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. క్రీడా సంఘాలలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. సింధూని ఆదర్శంగా తీసుకుని యువత ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు.
మరో వైపు హీరో పవన్ కల్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ మాట్లాడినతీరు సరిగా లేదన్నారు. ప్రాణహిత చేవేళ్ల డిజైన్ మార్చడం వల్ల జాతీయ హోదా కోల్పోవడం నిజమా? కాదా? అని కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.
Advertisement
Advertisement