వరంగల్ కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొండాపూర్ గ్రామంకు చెందిన వెంకటయ్య (39) 2015 సంవత్సరం సెప్టెంబర్లో భార్యను చంపిన కేసులో రిమాండ్ నిమిత్తం వచ్చాడు. బెయిల్ కోసం ఎవరూ షూరిటీ ఇవ్వకపోవడంతో జైలులోనే ఉంటున్నాడు.
అండర్ ట్రయల్ ఖైదీ మృతి
Jul 23 2016 11:10 PM | Updated on Sep 4 2017 5:54 AM
పోచమ్మమైదాన్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొండాపూర్ గ్రామంకు చెందిన వెంకటయ్య (39) 2015 సంవత్సరం సెప్టెంబర్లో భార్యను చంపిన కేసులో రిమాండ్ నిమిత్తం వచ్చాడు. బెయిల్ కోసం ఎవరూ షూరిటీ ఇవ్వకపోవడంతో జైలులోనే ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం గుండెనొప్పి వస్తుందని చెప్పడంతో జైలు సిబ్బంది వెంకటయ్యను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంటనే జైలు సిబ్బంది వెంకటయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Advertisement
Advertisement