అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 23న వినూత్న ఫర్టిలైజర్స్ తరఫున జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్పన తెలిపారు.
రేపు జాబ్మేళా
Jul 22 2016 12:43 AM | Updated on Sep 4 2017 5:41 AM
అనంతపురం టౌన్ :
అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 23న వినూత్న ఫర్టిలైజర్స్ తరఫున జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్పన తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగం కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు విద్యార్హత పత్రాలతో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలన్నారు. మొత్తం 30 మందిని ఎంపిక చేస్తామని, నెలకు రూ.7,500 జీతం ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement