నేడు పదోన్నతులకు కౌన్సెలింగ్‌ | today counseling for promotions | Sakshi
Sakshi News home page

నేడు పదోన్నతులకు కౌన్సెలింగ్‌

Apr 17 2017 10:49 PM | Updated on Sep 5 2017 9:00 AM

జిల్లా పరిషత్‌ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 38 ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలను అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో సీనియార్టీ ఉన్న వారితో భర్తీ చేయనున్నారు.

కర్నూలు సిటీ: జిల్లా పరిషత్‌ యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 38 ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలను అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో సీనియార్టీ ఉన్న వారితో భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం కౌనె​‍్సలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయం సీనియారిటీ జాబితాలోని క్రమ సంఖ్య 4 నుంచి 40 వరకు ఉన్న వారితో పాటు విస్తరించిన జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. పదోన్నతుల సీనియానిటీ జాబితా, ఖాళీల వివరాలను డీఈఓ వెబ్‌సైట్‌  http://drokrnl13.blogspot.inలో పొందిపరిచామన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు సర్వీసు రిజిస్టర్, డిపార్టుమెంట్‌ టెస్టు, 10 వతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ధృవ పత్రాలతో హాజరుకావాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement