భీమవరం టౌన్ : గరగపర్రు ఘటనలో దళితులకు న్యాయం చేయాలంటూ సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్తోపాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన చలో భీమవరం కార్యక్రమం బుధవారం భీమవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ముందుగానే పోలీసులు ప్రకటించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహించి తీరుతామని ఉద్యమకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యమం వేదిక భీమవరం పాతబస్టాండ్ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఏలూరు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. గరగపర్రు నుంచి దళితులు, చుట్టు పక్కల నుంచి ఉద్యమకారులు పాతబస్టాండ్కు చేరుకోకుండా ఉద్యమ వేదికకు నాలుగు దిక్కులా పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మెంటేవారితోట నుంచి శ్మశానం మీదుగా యనమదుర్రు డ్రెయిన్ గట్టువెంబడి ఆందోళనకారులు ఒక్క ఉదుటున అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని అక్కడ పోలీసులను తోసుకుని పరుగుపరుగున డప్పులు వాయిస్తూ పాతబస్టాండ్ వద్దకు చేరుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, నాయకులు బి.బలరాం, జేఎన్వీ గోపాలన్, బీవీ వర్మ మరో 30 మందికిపైగా ఉద్యమకారులు అక్కడికి చేరుకుని గరగపర్రు దళితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందుకు కదలనివ్వకుండా పోలీసులు వలయంగా చుట్టుముట్టారు. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు రోడ్డుపైన పడుకుని నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్ .మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వారందరినీ బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. అందరినీ వ్యాన్లలో ఎక్కించి కాళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. తరువాత సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, పట్టణ కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్ ఆధ్వర్యంలో మరికొందరు అక్కడికి చేరుకున్నారు. భీమవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుని ఎటువంటి అశాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
భీమవరంలో ఉద్రిక్తత
Published Thu, Jul 13 2017 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement