ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కన్నుమూత | suicide in parvatipuram | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కన్నుమూత

Jul 23 2016 8:24 PM | Updated on Sep 4 2017 5:54 AM

తనకు ఎవరూ లేరనే ఆత్మన్యూనతతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు

పార్వతీపురం : తనకు ఎవరూ లేరనే ఆత్మన్యూనతతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి  చికిత్స పొందుతూ మరణించాడు వివరాల్లోకి వెళితే...  విజయవాడకు చెందిన పెందుర్తి రవికి ఎవరూ లేరు. ఇన్నాళ్లు స్నేహితుడి ఇంట్లో ఉండేవాడు. ఇటీవల అతనికి వివాహం కావడంతో పని దొరుకుతుందని పార్వతీపురం వచ్చాడు. కానీ ఇక్కడ ఎవరూ పని ఇవ్వకపోవడంతో నాలుగు రోజులుగా ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. ఓ పక్క ఆకలి.. మరోపక్క ఎవరూ లేకపోవడంతో జీవితంపై విరక్తిచెంది శుక్రవారం పురుగు మందు తాగాడు.  స్థానికులు వెంటనే గుర్తించి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. అక్కడ చికిత్స  పొందుతూ రవి శనివారం మరణించాడు  

Advertisement
 
Advertisement
Advertisement