గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం | shiva lingam destroed in ananthpuram district | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం

Jul 20 2016 12:31 PM | Updated on Sep 4 2017 5:29 AM

గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం

గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం

పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేశారు.

కంబదురు(అనంతపురం): పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాక అడ్డొచ్చిన వాచ్‌మెన్‌ను కత్తులతో బెదిరించి పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మల్లేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన వాచ్‌మెన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతన్ని కత్తులతో బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement