పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం | Schools inspected by monotring | Sakshi
Sakshi News home page

పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం

Sep 22 2016 9:53 PM | Updated on Sep 4 2017 2:32 PM

పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం

పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ బృందం జిల్లా అధికారులు గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను, జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసింది.

రామన్నపేట
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మానిటరింగ్‌ బృందం జిల్లా అధికారులు గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను, జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసింది. కొండకింది అంజిరెడ్డి, సామల రమేష్‌తో కూడిన బృందం సభ్యులు పాఠశాలలోని రికార్డులను, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. తరగతులలో అధ్యాపకుల బోధనా సామర్థ్యంతో పాటు, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.  పాఠశాలల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. డివిజన్‌లోని అన్ని ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.  



 

Advertisement
 
Advertisement
Advertisement