అక్రమంగా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న 720 గ్రాముల బ్రౌన్ షుగర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న 720 గ్రాముల బ్రౌన్ షుగర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి గల్ఫ్ దేశాలకు నల్లమందు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం సాయంత్రం పాత బస్టాండ్లో తనఖీలు నిర్వహించి బ్రౌన్షుగర్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బ్రౌన్షుగర్ను స్వాధీనం చేసుకున్నారు.