అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు | Rs.500 crore for unfinished construction | Sakshi
Sakshi News home page

అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు

Aug 8 2017 10:50 PM | Updated on Jun 1 2018 8:36 PM

రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014కు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.70 వేలు ఉండేదన్నారు. ఆ మొత్తం సరిపోక 2 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా వద

అనంతపురం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి  కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014కు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.70 వేలు ఉండేదన్నారు. ఆ మొత్తం సరిపోక 2 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా వదిలేశారన్నారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి లబ్ధిదారులకు అదనంగా రూ.25 వేలు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన జీఓ 64ను విడుదల చేసిందన్నారు.  ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని 27,197 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణం కింద ఇళ్లు నిర్మించుకునే వారికి యూనిట్‌కు రూ.1.50 లక్ష మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఖాజామొహిద్దీ, హౌసింగ్‌ ఇన్‌చార్జ్‌ పీడీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement