♦ సిర్పూర్ మీదుగా మహారాష్ట్ర వరకు నాలుగువరుసల నిర్మాణం
♦ రోడ్లు, భవనాల శాఖ {పతిపాదనకు ప్రభుత్వం ఆమోదం
♦ దాదాపు రూ.వేయి కోట్ల వ్యయం!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిని మరో వంద కిలోమీటర్లు నాలుగు వరుసలుగా నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణానికి రూ.వేయి కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి మహరాష్ట్ర సరిహద్దు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచి ర్యాల ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు గనులతోపాటు వివిధ రకాల పరిశ్రమలు, పేపర్ మిల్స్ ఉండడంతో ఈ రోడ్డు బీఓటీ కింద నిర్మాణం సాధ్యమని నిర్ణయానికి వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. టోల్గేట్ల ద్వారా నిర్మాణ సంస్థలు ఆదాయం పొందుతాయి.
వంద కిలోమీటర్ల విస్తరణ...
ప్రస్తుతం రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉంది. ఇందులో మంచిర్యాల దాటిన తర్వాత ఇందారం వరకు మాత్రమే నాలుగు వరుసలుగా ఉంది. ఆ తరువాత నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి కలుస్తుంది. దాన్ని దాటుకుని అటు ఆసిఫాబాద్, ఇటు సిర్పూర్ వరకు సరైన రోడ్డు వ్యవస్థ లేదు. ఇది బొగ్గు గనులు, పరిశ్రమలతో ఉన్న ప్రాంతం కావడంతో ఆ రోడ్డును విస్తరించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అక్కడి నుంచి అటు మహారాష్ట్రకు ఎగుమతులు, దిగుమతులు ఉంటుండడంతో భారీ ట్రాక్కుల రాకపోకలూ జరుగుతాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు భవనాల శాఖ తాజాగా సర్వే నిర్వహించి బీఓటీ కింద రోడ్డును విస్తరించేందుకు వెసులుబాటు ఉందని గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. టోల్ప్లాజాల రూపంలో వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిర్మాణ సంస్థలు అంతగా ఉత్సాహం చూపడం లేదు. కానీ పరిశ్రమలు, బొగ్గు గనులున్నందున ఈ మార్గంలో ఆదాయం బాగానే ఉంటుందని రోడ్లు భవనాల శాఖ నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఇప్పటికే నిర్మాణమైన రాజీవ్ రహదారిలో ఉన్న లోపాలను సరి దిద్దేందుకు పం పిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, ఇందుకోసం అవసరమైన భూసేకరణ సంబంధించి ప్రతిపాదనకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.
రాజీవ్ రహదారి మరో 100 కి.మీ.
Published Tue, Oct 13 2015 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement