ఆడశిశువును పీక్కుతిన్న పందులు | Pigs eat female baby body near hanmakonda | Sakshi
Sakshi News home page

ఆడశిశువును పీక్కుతిన్న పందులు

Dec 31 2015 9:48 AM | Updated on Sep 3 2017 2:53 PM

ఆడశిశువును పీక్కుతిన్న పందులు

ఆడశిశువును పీక్కుతిన్న పందులు

వరంగల్‌ జిల్లాలో హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో గురువారం ఓ ఘోరం వెలుగుచూసింది.

హన్మకొండ: వరంగల్‌ జిల్లాలో హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో గురువారం ఓ ఘోరం వెలుగుచూసింది. ఆడపిల్ల తమకు భారమనుకున్నారో లేక అధిక కట్నాలిచ్చి పెళ్లి చేయలేమని భావించారో తెలియదు కానీ ముక్కుపచ్చలారని ఓ పసికందును వీధిపాలుచేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు ఆ పసిగొడ్డును వీధిలోని చెత్తకుండిలో విసిరేయడంతో పందులు పీక్కుని తిన్నాయి. రోడ్డుపక్కన నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన పసిగుడ్డును పందులు పీక్కుతింటుండగా స్థానికులు చూశారు. పందులను అక్కడినుంచి తరిమేసి చూడగా అప్పటికే శిశువు చనిపోయి ఉంది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement