-
ఎందుకీ వివక్ష.. ప్లీజ్ నన్ను బతకనివ్వండి
స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అలాంటిది కొందరు గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇంటికి లక్ష్మి వచ్చిందని మురిసిపోయేవారు. జిల్లా మొత్తం జనాభాలో ఆడవాళ్లే ఎక్కువ ఉండడానికి అదే కారణం. అయితే మగబిడ్డ అయితేనే వారసుడనే భావన ఏర్పడడం, ఆడపిల్ల పెళ్లికి వరకటా్నలు అడ్డగోలుగా పెరగడం తదితర కారణాలతో ఆడపిల్లలు వద్దనుకునేవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో ఆడబిడ్డల జననాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుల కోసం కడుపులో పెరిగేది ఆడనో, మగనో చెప్పేస్తున్నారు. ఆడబిడ్డ అని తెలిస్తే చాలు అబార్షన్లు చేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో జననాల సంఖ్యను పరిశీలిస్తే ఆడబిడ్డల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ ఆడబిడ్డలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయినప్పటికీ ఆడపిల్లల మీద వివక్ష పోవడం లేదు. జిల్లాలో కీలకమైన విభాగాలకు అధిపతులుగా మహిళలు ఉన్నా వారిని చూసైనా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తమకు పుట్టేది ఆడబిడ్డ అయితే వాళ్లలా ఉన్నతంగా ఎదుగుతుందన్న ఆశలు పెంచుకోవడం లేదు. దీంతో ఆడబిడ్డలను కడుపులోనే కడతేరుస్తున్నారు. గత ఆరేళ్ల కాలంలో జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మగపిల్లల కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం విచ్చలవిడిగా అబార్షన్లు చేయడమేననేది స్పష్టమవుతోంది. చదవండి: కువైట్ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు ఆగని భ్రూణ హత్యలు కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల రాజ్యలక్ష్మి నర్సింగ్హోంలో విచ్చలవిడిగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్న విషయంలో వివిధ శాఖల అధికారులు దాడులు నిర్వహించి ఆస్పత్రిని సీజ్ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ఆస్పత్రి నిర్వాహకుడు సులువుగా బెయిల్ సంపాదించి బయటకు వచ్చాడు. తిరిగి ఆస్పత్రిని తెరిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కేసు విషయంలో ఆలస్యమైతే మరో పేరుతో ఆస్పత్రిని తెరి చేందుకు ప్రయతి్నస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్ష లు, అబార్షన్లు నిర్వహించడం అనేది చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా జరుగు తున్నా ఇంతకాలం అధికారులు పట్టించుకోకపోవ డం గమనార్హం. అలాగే మరికొన్ని ఆస్పత్రుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నా రు. అయినా తమ దగ్గర పర్యవేక్షణకు అవసరమైన టీం లేదని చెబుతూ వైద్యఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నాయి. చదవండి: రంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రియల్ రంగం జననాల్లో ఆడపిల్లలే తక్కువ ఆరేళ్లుగా జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం భ్రూణ హత్యలే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం మగ పిల్లల కన్నా ఆడపిల్లలు 4 వందల నుంచి 5 వందల వరకు తక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1 నుంచి జూలై 30 వరకు నాలుగు నెలల్లో జిల్లాలో 4,366 మంది జన్మిస్తే అందులో మగ పిల్లలు 2,366 మంది కాగా, ఆడపిల్లలు 2 వేల మంది. అంటే తేడా 366 మంది ఉన్నారు. ప్రతిఏడాది ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మగపిల్లలకు ఆడపిల్లలు కరువై చాలా మంది పెళ్లికాని ప్రసాద్లుగా ఉంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ అనేది నిర్ధారించడం చట్ట విరుద్ధం. జిల్లాలో అనుమతి లేకుండా ఉన్న స్కానింగ్ సెంటర్ను ఇటీవలే మూసి వేయడం జరిగింది. ఎక్కడైనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందితే చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, సమాజం అందరూ ఆలోచించాలి. – చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి అవగాహన కార్యక్రమాలు చేపడతాం ఆడపిల్ల లేనిది సృష్టి లేదు. జిల్లా జనాభాలో ఆడవాళ్ల జనాభా ఎక్కువగానే ఉంది. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లల జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా యి. అయినా తల్లిదండ్రులు మగబిడ్డపై మమకారంతో ఆడపిల్లలు వద్దనుకోవడం సరికాదు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – సరస్వతి, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి, కామారెడ్డి -
చెర్రి.. పండులా మారింది!
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు. నెలలు నిండక ముందే తక్కువ బరువు(కేవలం 375 గ్రాముల బరువు)తో జన్మించిన ఆడశిశువు(చెర్రి)కు పునర్జన్మ ప్రసాదించారు. అబార్షన్ వల్ల ఇప్పటికే నాలుగుసార్లు పిల్లలకు దూరమైన ఆ దంపతుల జీవితాల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం శిశువు ఎత్తు, బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచెర్ల, ఇంటెన్సివ్కేర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ చికిత్స వివరాలు వెల్లడించారు. వైద్యులకు కలసి వచ్చిన గత అనుభవం ఛత్తీస్గఢ్కు చెందిన సౌరభ్ భార్య నిఖితకు గర్భం దాల్చిన 24 వారాల తర్వాత స్థానిక ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ నిర్వహించారు. ఉమ్మనీరు తగ్గడంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని వైద్యులు నిర్ధారించారు. తల్లి నుంచి రక్తప్రసరణ కూడా నిలిచిపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు అనేకమంది వైద్యులను సంప్రదించగా అబార్షన్ చేయడమే పరిష్కారమని చెప్పారు. చివరకు ఆ దంపతులు హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అప్పటికే 449 గ్రాముల శిశువును రక్షించిన అనుభవం ఈ ఆస్పత్రి వైద్యులకు ఉంది. ఫిబ్రవరి 27న నిఖితకు సిజేరియన్ చేసి కడుపులోని ఆడబిడ్డ(చెర్రి)ను బయటికి తీశారు. అప్పుడు బిడ్డ బరువు కేవలం 375 గ్రాములు. 26 సెంటీమీటర్ల పొడవు మాత్రమే. సాధారణంగా ప్రసవ సమయంలో ఆరోగ్యవంతమైన బిడ్డ బరువు 2.8 కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది. అనేక సవాళ్లను అధిగమించి.. శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం, బీపీ తక్కువగా నమోదు కావడం వైద్యులకు పెద్ద సవాల్గా మారింది. పుట్టిన వెంటనే వెంటిలేటర్పైకి చేర్చి వైద్యం అందించారు. ఎప్పటికప్పుడు మెదడు, గుండె, మూత్రపిండాల పనితీరును పరీక్షిస్తూ ప్రత్యేక మందులతోపాటు న్యూట్రిషన్ను కూడా అందించారు. 128 రోజులపాటు ఐసీయూలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. 105 రోజులు వెంటిలేటర్పై ఉంచారు. ప్రస్తుతం శిశువు బరువు 2.45 కేజీలకు, ఎత్తు 46 సెంటిమీటర్లకు చేరుకుంది. ఆగ్నేయాసియాలోనే తొలి కేసు నెలలు నిండక ముందే తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ ప్రసాదించడం ఆగ్నేయాసియా వైద్య చరిత్రలోనే ఇది మొదటిది. గతంలో 449 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన అనుభవం ఉండటం వల్లే ఇది మాకు సాధ్యమైంది. అత్యాధునిక ఐసీయూ, వెంటిలేటర్ సపోర్టు, వైద్యపరంగా ఉన్న అనుభవం ఇందుకు తోడయ్యాయి. - డాక్టర్ దినేష్కుమార్, రెయిన్బో ఆస్పత్రి ఆశలు వదులుకున్నాం నాలుగు సార్లు అబార్షన్ కావడం, ఐదోసారి కూడా అదే పరిస్థితి తలెత్తడంతో చాలా ఆందోళన చెందాం. ఇక పిల్లలపై ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంలో భాగంగా రెయిన్బోకు వచ్చాం. అదృష్టవశాత్తూ మా బిడ్డ మాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు. – నిఖిత, సౌరభ్ -
అమ్మేశారా.. చంపేశారా.
► ఆడ శిశువు అదృశ్యంపై అనుమానాలు ► మృతి చెందిందని చెబుతున్న శిశువు తల్లిదండ్రులు ► పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు దేవరకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడ పిల్లల సంరక్షణ కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆడ పిల్లలపై వివక్షత రోజు రోజుకు పెరిగిపోతోంది. శిశు బ్రూణ హత్యలపై పోలీసులు ఎన్నో అవగాహన సదస్సులు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నల్గొండలో శిశువు అదృష్యం కలకలం రేపుతోంది. శిశువును విక్రయించారా.. చంపేశారా అనేది తేలక సందిగ్ధం నెలకొంది. ఈ హృదయ విచారక ఘటన చందంపేట మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతికి చందంపేట మండలం గాగిళ్లాపురం పద్మలకు గత ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది.వీరికి మొదటి కాన్పులో ఆడపిల్ల, రెండో కాన్పులో మగబిడ్డ మూడో కాన్పులో ఆడబిడ్డలు జన్మించారు. నాల్గో సంతానంగా ఈ నెల 5 న ఆడ శిశువు జన్మించింది. ఈ చిన్నారి వివరాలు స్థానిక అంగన్ వాడి సెంటర్లో నమోదయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో అంగన్వాడి టీచర్ బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఆడ శిశువు కనిపించకపోవడంతో శిశువు తల్లి పద్మను ప్రశ్నించింది. ఆమె గత ఐదు రోజుల క్రితం మృతి చెందిదని చెప్పింది. భర్తను విచారించగా పదిహేను రోజుల క్రితం మరణించిందని పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానంతో అంగన్వాడి టీచర్ పై అధికారులకు సమాచారం ఇచ్చింది. సీడీపీవో సక్కుబాయి, స్థానిక సూపర్వైజర్ పద్మలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. -
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు. సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
ఆడ శిశువు మృతదేహం లభ్యం
కణేకల్లు: కణేకల్లు–ఎర్రగుంట మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ఆదివారం ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అటువైపు బైక్పై వెళ్తున్న కొందరికి కల్వర్టు వద్ద కుక్కలుండటం గమనించారు. దగ్గరకెళ్లి కుక్కలను తరిమేయగా వారికి మృతశిశువు కనిపించింది. వెంటనే పైన పేర్కొన్న గ్రామాల వారికి విషయం తెలిపారు. వారొచ్చి మృత శిశువును చూసి కంటతడి పెట్టారు. బతికుండగా పడేసి వెళ్లారో, లేక చనిపోయాక ఖననం చేయకుండా వదిలేసి వెళ్లారో అంతుబట్టడం లేదు. పసికందును అలా పడేయటానికి వారికి మనసెలా వచ్చిందోనంటూ శాపనార్థాలు పెట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement