కారు బోల్తా: ఒకరు మృతి | One killed in Road accident, Car turns | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఒకరు మృతి

Dec 12 2015 6:30 AM | Updated on Sep 3 2017 1:53 PM

అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.

అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement