ఆటో,లారీ ఢీ- ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు | One died and 7 injured in Road accident | Sakshi
Sakshi News home page

ఆటో,లారీ ఢీ- ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

Aug 26 2016 3:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సిరిసిల్ల (కరీంనగర్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement