బీజేపీ, కాంగ్రెస్‌లకు ఫలితం దక్కదు: కవిత | MP Kavitha about BJP and congress | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌లకు ఫలితం దక్కదు: కవిత

Nov 18 2015 3:27 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ, కాంగ్రెస్‌లకు ఫలితం దక్కదు: కవిత - Sakshi

బీజేపీ, కాంగ్రెస్‌లకు ఫలితం దక్కదు: కవిత

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తలాతోక లేని మాటలు మాట్లాడటం సరికాదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తలాతోక లేని మాటలు మాట్లాడటం సరికాదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని టీహబ్‌ను ఆమె మంగళవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రయాత్నాలు చేసినా, ఓటర్లను మభ్యపెట్టినా ఫలితం దక్కదన్నారు. అక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

పత్తి మద్దతుధరను సగం పెంచాలని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా కేంద్రం కేవలం రూ.50 మాత్రమే పెంచిందని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ రైతన్నల పరిస్థితి దుర్భరంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి స్వామినాథన్ కమిటీ సిఫారసులను కేంద్రం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement