♦ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయనున్న మోదీ
♦ అనంతరం తిరుపతిలో విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభం
♦ సాయంత్రం శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధానమంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9.25 గంటలకు భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి, 11.50 గంటలకు విజయవాడకు సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన అనంతరం తిరుపతికి వెళతారు. కొత్తగా నిర్మించిన తిరుపతి విమానాశ్రయం గరుడ టెర్మినల్ను ప్రారంభిస్తారు. తిరుపతిలో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రం)కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతారు.
ఇదీ ప్రధాని పర్యటన షెడ్యూల్..
► ఉదయం 9.25 గంటలు: ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు.
► 11.50 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
► 11.55 గంటలు: గన్నవరం విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్లో అమరావతికి పయనం
► మధ్యాహ్నం 12.20 గంటలు: అమరావతి హెలీప్యాడ్ను చేరుకుంటారు.
► 12.25 గంటలు: హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో రాజధాని శంకుస్థాపన వేదిక వద్దకు బయలుదేరుతారు
► 12.30 గంటలు: శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు.
► 12.30 నుంచి 1.45 గంటలు: నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు.
► 2.00 గంటలు: అమరావతి నుంచి హెలీకాప్టర్లో బయలుదేరతారు.
► 2.25 గంటలు: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
► 2.30 గంటలు: గన్నవరం విమానాశ్రయం విమానంలో తిరుపతి పయనం (విమానంలోనే భోజనం చేస్తారు)
► సాయంత్రం 3.25 గంటలు: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
► 3.30 నుంచి 3.45 గంటలు: తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన గరుడ టర్మినల్ను ప్రారంభిస్తారు.
► 3.50 గంటలు: తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరతారు.
► 3.55 గంటలు: మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు.
► 3.55 నుంచి 4.15 గంటలు: మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్కు శంకుస్థాపన చేస్తారు.
► 4.20 గంటలు: రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరతారు.
► 5.00 గంటలు: తిరుమలలో పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు.
► 5.00 నుంచి 5.10 గంటలు: విశ్రాంతి తీసుకుంటారు.
► 5.15 నుంచి 6.15 గంటలు: శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
► 6.15 గంటలు: పద్మావతి అతిథి గృహం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
► 6.55 గంటలు: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
► రాత్రి 7.00 గంటలు: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు.
► 9.35 గంటలు: ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..
Published Thu, Oct 22 2015 8:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement