
అమ్మవారిశాలలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు
స్థానిక అమ్మవారిశాలతో పాటు కోదండరామస్వామి ఆలయం , మహాలక్ష్మిదేవి ఆలయాలలో ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బద్వేలు అర్బన్: స్థానిక అమ్మవారిశాలతో పాటు కోదండరామస్వామి ఆలయం , మహాలక్ష్మిదేవి ఆలయాలలో ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం వారు ఎమ్మెల్సీని మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించి వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు జ్ఞాపికతో పాటు శాలువాతో ఎమ్మెల్సీని, సమన్వయకర్తను సత్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి, శ్రద్ధలతో దసరా పండుగ జరుపుకోవాలని , అమ్మవారు భక్తులందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ సింగసాని గురుమోహన్, సింగిల్ విండో అధ్యక్షులు సుందరరామిరెడ్డి, బి.కోడూరు జడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శులు సింగసాని శివయ్య, కొండుశేఖర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపాల్రెడ్డి లతోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండపల్లి చిన్న సుబ్బారావు , పీవీఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.