అక్రమాలకు తావివ్వకుండా చూస్తున్నాం: కేటీఆర్
♦ తెలంగాణకు భవిష్యత్తులో తాగునీటి కష్టాలుండవు
♦ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని వెల్లడి
♦ 18ఏళ్ల క్రితమే సిద్ధిపేటలో ఇంటింటికీ నీరివ్వడమే దీనికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఓ ఆదర్శ పథకంగా నిలిచిపోయేలా వాటర్గ్రిడ్కు రూపకల్పన చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మిస్తుండడం సాహసోపేతమని... నీటి కోసం పాలమూరు కష్టాలు, నల్లగొండకు ఫ్లోరైడ్ బాధలు భవిష్యత్తులో ఉండవని చెప్పారు. మంగళవారం శాసనసభలో వాటర్గ్రిడ్పై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రూపొందిన నీటి పథకాలను వాటర్గ్రిడ్తో అనుసంధానిస్తున్నామని చెప్పారు.
నల్లగొండలో పరిస్థితి మారకుంటే మానవ రహిత ప్రాంతంగా మారుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 18 ఏళ్ల కింద సిద్ధిపేటలో ఇంటింటికి తాగునీటిని అందించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు రాష్ట్రమంతటా దాన్ని విస్తరించే క్రమంలో రూ.36 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును ప్రారంభించారని వెల్లడించారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసేలా 26 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి దానికి కాలపరిమితి విధిస్తున్నామని తెలిపారు. అవినీతికి తావులేకుండా ఈపీసీ విధానానికి స్వస్తి చెప్పామని... ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకే అన్నిరకాల బాధ్యతలు అప్పగించే విధానాన్ని నిలిపివేశామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యయన బాధ్యతతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను వ్యా ప్కోస్కు అప్పగించామన్నారు. ఇప్పటికే 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లిస్తున్నందున ఈ ప్రాజెక్టు అవసరమే లేదని కొందరు అంటున్నారని... 80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు అందుతున్న విషయం వాస్తవమైతే తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు.
వినియోగదారులపై భారం మోపుతారా?
వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు వినియోగించే విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందా, వినియోగదారులపై మోపుతారా అని అధికారపార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటి సేకరణ మొత్తాన్ని పెంచాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యేలను పిలవాలని మరో సభ్యుడు కిషోర్ కోరారు. గతంలో ఇంజనీర్గా పనిచేసిన అనుభవమున్న తనలాంటి వారి సేవలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు గుజరాత్లో అమలవుతున్నందున అక్కడ పనిచేసిన రిటైర్డ్ అధికారుల సేవలు తీసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్తో కూడా అనుసంధానించాలని మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్ కోరారు.
ప్రపంచానికే ఆదర్శంగా వాటర్గ్రిడ్
Published Wed, Oct 7 2015 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement