♦ మోసపోయిన ఆంజనేయపురానికి చెందిన 8 మంది యువకులు
♦ రూ. 80 వేలు చొప్పున అర్పించిన వైనం
♦ పోలీసులకు ఫిర్యాదు
టెక్కలి రూరల్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురు యువకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠా చేతిలో మోసపోయామని ఆంజనేయపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు టెక్కలి ఎస్ఐ జి.రాజేష్ వద్ద వాపోయారు. ఈ మేరకు బాధితులు ముడిదాన గిరిరాజు, రాము స్థానిక పోలీసు స్టేషన్కు ఆదివారం వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... క్యూనెట్ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని గ్రామానికి చెందిన కొందరు యువకులను ఆ సంస్థ ప్రతినిధులు నమ్మించారు. సభ్యత్వం కావాలంటే ముందుగా రూ. 80 వేలు సదరు సమస్థ ప్రతినిధులకు అప్పజెబితే వారు సభ్యత్వం కింద ఒక వాచీ ఇస్తారు.
వాచీ అందుకున్న సదరు యువకుడు మరో ముగ్గురిని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల చొప్పున వసూలు జరిగిన తర్వాత చైన్ లింక్ పద్ధతి ప్రకారం ఒక్కొక్కరు ముగ్గురిని చొప్పున జాయిన్ చేసుకోవాలని ఇలా చేరిన వారికి విశాఖపట్నంలో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తామని అనంతరం హాంకాంగ్, మలేషియా వంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు సంస్థ ప్రతినిధులు యువకులను నమ్మించారు. దీంతో ఆంజనేయపురం గ్రామానికి చెందిన సుమారు 8 మంది వ్యక్తులు రూ. 80 వేల చొప్పున చెల్లించారు. ముందుగా హైదరాబాద్ చేరుకున్న వీరికి నెల రోజుల తర్వాత విశాఖపట్నం పంపారు.
అక్కడ ఒక చిన్న గదిలో కంప్యూటర్పై అవగాహన అని చెప్పి కొద్దిరోజులు గడిపిన తర్వాత వీరి నుంచి మరికొంతమంది మిత్రులు, బంధువుల ఫోన్ నంబర్లను సేకరించారు. వారిని కూడా సభ్యులుగా చేర్చమని ఒత్తిడి తెచ్చేవారని బాధిత యువకులు తెలిపారు. సంస్థ తీరుపై అనుమానం వచ్చి తాము మోసపోయినట్టు గ్రహించామని బాధితులు ఎస్ఐకి చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్ఐ మాట్లాడుతూ ఆన్లైన్లో పలు బోగస్ సంస్థలు ఉన్నాయన్నారు. వాటిని నమ్మి యువత మోసపోవడం తగదని చెప్పారు. క్యూనెట్ అనే అంతర్జాతీయ సంస్థ, ఆ సంస్థ ప్రతినిధుల ఆచూకీకి కృషి చేస్తామని ఎస్ఐ తెలిపినట్టు బాధితులు పేర్కొన్నారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా
Published Mon, Sep 4 2017 1:32 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement