వడదెబ్బతో ఒకరి మృతి | man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఒకరి మృతి

Apr 30 2017 11:43 PM | Updated on Jul 11 2019 8:55 PM

గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక న్యూ సీపీఐ కాలనీకి చెందిన ఫకృల్లాఖాన్‌(45) వడదెబ్బకు గురై ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు.

గుత్తి : గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక న్యూ సీపీఐ కాలనీకి చెందిన ఫకృల్లాఖాన్‌(45) వడదెబ్బకు గురై ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. పూల మండిలో కూలీ పనులు చేసే అతను వ్యాపారం నిమిత్తం వారం రోజులుగా బాగా తిరిగాడన్నారు. దీంతో శనివారం సాయంత్రం కళ్లు తిరిగి కింద పడిపోయాడని చెప్పారు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలు కాగా, స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పిల్చుకెళ్లగా ఆదివారం తెల్లవారు జామున మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement