నకిరేకల్ : రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలో 3.8కోట్లతో నిమ్మ మార్కెట్కు, రూ. 3.7కోట్లతో మినీ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక పెద్ద చెరువు వద్ద సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్థానిక మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. అందరికంటే ముఖ్యంగా రైతన్న బాగుండాలనదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో 45శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.
రూ.25వేల కోట్ల నిధులతో రైతుల కోసం ఊరూరా మిషన్ కాకతీయ కింద చెరువుల బాగు కోసం ఖర్చుచేశామన్నారు. ఒకప్పుడు చెరువు మీదకు వెళ్తే సర్కారు, తుమ్మ చెట్లు తప్ప మరేవి కనపడేవి కావు. గత పాలకులు చెరువుల బాగు గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం హయూంలో గ్రామంలోని చెరువులు నీటితో నిండుగాా కళకళలాడుతూ ఊరికి జీవనోపాధిగా నిలిచాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాబోయే యాసంగి పంటలలో రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు.
ఒక్క చుక్క మూసీ నీటిని కూడా కృష్ణాలోకి పోనివ్వం..
ఈ జిల్లాలకు హరితహారంలో సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ.285 కోట్లను మూసీ ఆధునీకరణ కోసం అడగగానే వెంటనే నిధులు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు పిలిపించి ఈ ఎండాకాలంలోనే మూసీ కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టి ఒక్కచుక్క మూసీ నీటిని కృష్ణానదిలోకి పోనివ్వకుండా కృషి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా త్వరలోనే టెండర్లు వేసి అతిత్వరలోనే పనులు ప్రారంభించి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం తమ ప్రభుత్వం చేయబోతుందన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీశాఖ రాష్ట్ర చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జెడ్పీచైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నకిరేకల్, శాలిగౌరారం మండలాల జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, ఐతగోని సునిత, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్రెడ్డి, లింగస్వామి, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, సుంకరి మల్లేష్గౌడ్, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, వివిధ మండలాల మండల శాఖ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, రహీంఖాన్, రాములు, వెంకన్న, శ్రీనివాస్ ఉన్నారు.
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా
Published Tue, Oct 25 2016 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement