విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి | lease farmer died with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

Jan 5 2017 12:42 AM | Updated on Oct 1 2018 2:44 PM

పొలానికి నీరు కట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతును విద్యుత్‌ కబళించింది.

కౌతాళం: పొలానికి నీరు కట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతును విద్యుత్‌ కబళించింది. ఈ ఘటన వల్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన అడివప్పగౌడు(35) రోజువారి మాదిరిగానే తాను కౌలుకు చేపట్టిన పొలానికి నీళ్లు కట్టేందుకు బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. విద్యుత్‌ మోటారుకు ఉన్న స్విచ్‌ను ఆన్‌ చేయగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం చుట్టు పక్కల ఉన్న పొలం వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement