కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు | Krishna puskaralaku special trains | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

Aug 9 2016 11:25 PM | Updated on Sep 4 2017 8:34 AM

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంతకల్లు జంక్షన్‌ నుంచి గుంతకల్లు–కృష్ణా–గుంతకల్లు, గుంతకల్లు–కృష్ణా కెనాల్‌–గుంతకల్లుకు నాలుగు ప్రత్యేక ప్యాసింజర్‌ రెళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

గుంతకల్లు: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంతకల్లు జంక్షన్‌ నుంచి గుంతకల్లు–కృష్ణా–గుంతకల్లు, గుంతకల్లు–కృష్ణా కెనాల్‌–గుంతకల్లుకు నాలుగు ప్రత్యేక ప్యాసింజర్‌ రెళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కర్నూలు జిల్లాలోని కృష్ణాకు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో  గుంతకల్లు నుంచి (రైలు నం.07944›) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణపు రైలు (07945) ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటలకు కృష్ణా నుంచి బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 8.15 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఆదోని, మంత్రాలయం, రాయచూరు మీదుగా వెళ్తాయి.  అదేవిధంగా గుంతకల్లు–కృష్ణాకెనాల్‌ సేష్టన్‌కు (రైలునం–07946) ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో గుంతకల్లుల్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు కృష్ణాకెనాల్‌కు చేరుతాయి. తిరుగు ప్రయాణపు రైలు (07947) 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో కృష్ణాకెనాల్‌ సేష్టన్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10 గంటలకు గుంతకల్లు చేరుతుంది. ఈ రైలు డోన్, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్డు, దోనకొండ, వినుకొండ, నరసరావుపేట, ఫిరంగిపురం, గుంటూరు, మంగళగిరి మీదగా కృష్ణాకెనాల్‌కు నడుపుతున్నారు. మొత్తం 8 జనరల్‌ బోగీలుంటాయని, ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement