వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు | IT attacks in business magnets homes | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు

Sep 26 2016 10:12 PM | Updated on Sep 27 2018 4:02 PM

గుంటూరు నగరం మంగళదాస్‌నగర్‌ ప్రాంతంలోని వివిధ వ్యాపారవేత్తల గృహాలు, వాణిజ్య సముదాయాలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారని సమాచారం.

పాత గుంటూరు: గుంటూరు నగరం మంగళదాస్‌నగర్‌ ప్రాంతంలోని వివిధ వ్యాపారవేత్తల గృహాలు, వాణిజ్య సముదాయాలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారని సమాచారం.  విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిలో వ్యాపారవేత్తలు సుమారు రూ. 400 కోట్లతో నూతన షాపింగ్‌ కాంప్లెక్సు, ఇతర భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 5 కోట్ల నగదుతోపాటు, 20 మంది వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం కూడా విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement