'సోనియాగాంధీ ఆదేశంతోనే నామినేషన్ వేశా' | i have only put nomination by orders of Sonia gandhi, says Sarve satyanarayana | Sakshi
Sakshi News home page

'సోనియాగాంధీ ఆదేశంతోనే నామినేషన్ వేశా'

Nov 4 2015 7:30 PM | Updated on Nov 6 2018 4:04 PM

'సోనియాగాంధీ ఆదేశంతోనే నామినేషన్ వేశా' - Sakshi

'సోనియాగాంధీ ఆదేశంతోనే నామినేషన్ వేశా'

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, మనమళ్ల సజీవ దహనం తనను ఎంతో కలిసివేసిందని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ చెప్పారు.

వరంగల్: మాజీ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, మనమళ్ల సజీవ దహనం తనను ఎంతో కలిచివేసిందని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయొద్దనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకే తాను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని సర్వే ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement