సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో | flods to sunkeshula barage | Sakshi
Sakshi News home page

సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో

Aug 3 2016 1:16 AM | Updated on Sep 4 2017 7:30 AM

శాంతినగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఓమోస్తరు వర్షాలకు రాజోలి సమీపంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం సాయంత్రం సుంకేసుల జలాశయం వద్ద 1850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

శాంతినగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఓమోస్తరు వర్షాలకు రాజోలి సమీపంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం సాయంత్రం సుంకేసుల జలాశయం వద్ద 1850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.19 టీఎంసీల స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ భద్రత దృష్ట్యా ఎగువనుండి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు కేసీ కెనాల్‌ద్వారా కర్నూలు ప్రజల తాగునీటి అవసరాలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జేఈ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement