breaking news
sunkeshula
-
సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే: భట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు అదేశించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆయన గురువారం మింట్ కాంపౌండ్లో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రజల కోసమే నిరంతరం ఎస్పీడీసీఎల్ పనిచేస్తోంది అని మర్చిపోవద్దు’’ అని అన్నారు.సుంకిశాలపై తప్పడు ప్రచారం.. సుంకిశాలపై వార్తల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని భట్టి విక్రమార్క్ అన్నారు. ‘మేడిగడ్డ గోదావరి నదిపై మాత్రమే కాదు.. కృష్ణానదిని కూడా గత ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సుంకిశాల కట్టింది మేము కాదు.. గత ప్రభుత్వం కట్టిందే. గోదావరి మెడిగడ్డతో పాటు సుంకుశాల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. 2021లో మొదలు 2023 జులైలో సుంకిశాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. గత ప్రభుత్వ పాపాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు గత ప్రభుత్వనికి బుద్ధి చెప్పారు’ అని అన్నారు. -
సుంకేసులకు పెరిగిన ఇన్ఫ్లో
శాంతినగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఓమోస్తరు వర్షాలకు రాజోలి సమీపంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం సాయంత్రం సుంకేసుల జలాశయం వద్ద 1850 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.19 టీఎంసీల స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ భద్రత దృష్ట్యా ఎగువనుండి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు కేసీ కెనాల్ద్వారా కర్నూలు ప్రజల తాగునీటి అవసరాలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జేఈ పేర్కొన్నారు.