పెదపాడు గాంధీనగర్లో అగ్ని ప్రమాదం
19 పూరిళ్లు దగ్ధం
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
రూ.25 లక్షలు ఆస్తినష్టం
పాతశ్రీకాకుళం/శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడు గాంధీనగర్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 25 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకు కావడంతో మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా నిరుపేదలు కావడం, ఉన్నదంతా అగ్నికి ఆహుతి కావడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఇళ్లలోని నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాంధీనగర్ శివారులో 23 పూరిళ్లలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వీధివ్యాపారులు చేసుకోవడం, ఇళ్లలో పాచిపనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరిలో 19 కుటుంబాలకు చెందిన ఇళ్లు బూడిద కావడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రమాద సమాయంలో ఓ ఇంటిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. అరుుతే పక్కనే ఉన్న ఇల్లు బూడిదవ్వగా.. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంగన్వాడీ కేంద్రానికి ప్రమాదం తప్పింది. అందులో ఉన్న 38 మంది పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకొని వెళ్లిపోయారు.
బాధిత కుటుంబాలు..
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోరుున వారిలో దాసు అప్పన్న, దాసు పోలయ్య, పట్ట అప్పమ్మ, పట్ట నీలరాజు, పట్ట రాము, కలగ సూర్యనారాయణ, తొగరాపు లక్ష్మి, కోరాడ రాజు, మగడ అప్పారావు, తొగరాపు కామేశ్వరి, సవలాపురం గణేష్, పోలాకి లక్ష్మి, దువ్వ సూర్యనారాయణ, ఎచ్చెర్ల రామకృష్ణ, కోడ తిరుపతిరావు, దువ్వ పంటోడు, కొవరాపు కృష్ణ, ఎచ్చెర్ల ఎర్రమ్మ, బి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో ఆస్తి నష్టం తగ్గింది.
నష్టం రూ.25 లక్షలు
ప్రమాదంలో 19 మంది బాధితులకు సంబంధించి సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని శ్రీకాకుళం తహసీల్దార్ సుధాసాగర్ తెలిపారు. పెద్దపాడు సొసైటీ భూముల్లో వీరు పూరిళ్లలో నివసిస్తున్నారన్నారు. 30 నిమిషాల వ్యవధిలోనే ఇళ్లన్నీ దగ్ధమయ్యావని, ప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తక్షణ సాయంగా బాధితులకు పదేసి కిలోల చొప్పున బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, రూ.5 వేల నగదు ఇస్తామన్నారు. రెడ్క్రాస్ తరపున దుస్తులు, వంటపాత్రలు సమకూర్చుతామని, ముఖ్యమంత్రి రిలీఫ్ఫండ్కు ప్రతిపాదిస్తామన్నారు.
- సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం
శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, శ్రీకాకుళం
సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు.గాలి వీయడంతో ఇళ్లకు మంటలు త్వరగా వ్యాపించి కాలిపోయినట్టు పేర్కొన్నారు. ఓ ్రపయాణీకుని సమాచారంతో తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని మంటలను తమ సిబ్బంది అదుపు చేశారన్నారు.
కష్టార్జితం బూడిద
Published Tue, Nov 8 2016 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement