‘బడీడు పిల్లలందరినీ చదివించాలి’ | every chaild must goto school | Sakshi
Sakshi News home page

‘బడీడు పిల్లలందరినీ చదివించాలి’

Sep 17 2016 11:58 PM | Updated on Sep 15 2018 4:12 PM

బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించి చదివించాలని మారీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జయచంద్ర అన్నారు. ఆయన మండలంలోని జామ్ని గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని తమ స్వచ్ఛంద సంస్థ తరఫున దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

జైనథ్‌ : బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించి చదివించాలని మారీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జయచంద్ర అన్నారు. ఆయన మండలంలోని జామ్ని గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని తమ స్వచ్ఛంద సంస్థ తరఫున దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
     దత్తతలో భాగంగా గ్రామంలో రానున్న మూడు సంవత్సరాల్లో వంద శాతం అక్షరాస్యత సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీంతో పాటు గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను రూపుమాపేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. గ్రామంలో ప్రతీ చిన్నారి చదువుకునేలా గ్రామస్తులందరికీ బాలల చట్టాలపై అవగాహణ కల్పించడంతో పాటు, చట్టాల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామస్తులంతా తమకు సహకరించి, గ్రామాభివద్ధికై పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెందూర్‌ మోహన్, సంస్థ ప్రతినిధులు సంజీవ్, సంగీత, రతన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement