కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ | enquiry on cast certificate | Sakshi
Sakshi News home page

కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ

Apr 2 2017 12:08 AM | Updated on Apr 3 2019 5:51 PM

బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం డీఎల్‌ఎస్‌సీ కమిటీ విచారణ జరిపింది.

కర్నూలు(అగ్రికల్చర్‌): బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం డీఎల్‌ఎస్‌సీ కమిటీ విచారణ జరిపింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో వాచ్‌మెన్‌గా పనిచేసే సవారన్న .. ఒరిజినల్‌ కులం బుడగజంగం కాగా లింగదారికోయ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినట్లు జిల్లా గిరిజన  ఉద్యోగుల సంఘం, జిల్లా గిరిజన ఐక్యవేదిక నేతలు.. కమిటీ చైర్మన్‌ అయిన జేసీకి వివరించారు. సవారన్న స్వంత తమ్ముడు ఉరుకుందయ్య బుడగ జంగం కులం బీసీ–ఏ సర్టిపికెట్‌తో సర్వజన వైద్యశాలలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నారని వివరించారు.  దీంతో జేసీ.. సవారన్న నియామకానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని పెద్దాసుపత్రి సూపరింటెండెటును ఆదేశించారు. కాగా లింగమూర్తి అనే వ్యక్తి దాసరి (బీసీ) కులానికి చెందినవారు అయితే మాలదాసరి ఎస్సీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందనట్లు వచ్చిన ఆరోపణలపైన కమిటీ విచారణ జరిపింది. విచారణలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు ఆర్‌డీఓ హుసేన్‌సాహెబ్, సి.సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రామాంజనమ్మ, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుమద్దిలేటి, కార్యదర్శి రాముడుఉసాధ్యక్షుడు మద్దయ్య, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement