సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ | east coast express train stopped due to technical issues | Sakshi
Sakshi News home page

సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్

Sep 8 2015 4:39 PM | Updated on Sep 3 2017 9:00 AM

సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

వరంగల్ : సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్ప్రెస్ రైలులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement