ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బుధవారం ఉదయం మళ్లీ భూప్రకంపనలు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.
హైదరాబాద్: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ భూప్రకంపనలు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, విజమూరు, వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది.
అలాగే ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులుతీశారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే.