రూ.15 లక్షలు వేస్తామని చెప్పలేదు... | Demonetisation:all rumours linked to bank accountes, says purandeswari | Sakshi
Sakshi News home page

కేవలం అపోహ మాత్రమే: పురందేశ్వరి

Nov 19 2016 1:49 PM | Updated on Mar 29 2019 9:31 PM

రూ.15 లక్షలు వేస్తామని చెప్పలేదు... - Sakshi

రూ.15 లక్షలు వేస్తామని చెప్పలేదు...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సొంత ఖాతాలో రెండున్నర లక్షలు వేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నది కేవలం అపోహ మాత్రమే అని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సొంత ఖాతాలో రెండున్నర లక్షలు వేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నది కేవలం అపోహ మాత్రమే అని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆమె శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పలేదన్నారు.

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయొచ‍్చని మాత్రమే ప్రధాని చెప్పారని పురందేశ్వరి వివరణ ఇచ్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో  దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులు అయినా జనాలు బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద డబ్బుల కోసం ​క్యూ కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement