మొసలిని బంధించిన గ్రామస్తులు | crocodile catched after attack on a women in nalgonda district | Sakshi
Sakshi News home page

మొసలిని బంధించిన గ్రామస్తులు

Dec 10 2016 10:00 AM | Updated on Sep 4 2017 10:23 PM

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామస్తులు మొసలిని పట్టుకుని బందీని చేశారు.

అడవిదేవులపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామస్తులు మొసలిని పట్టుకుని బందీని చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మహిళలు సమీపంలోని కృష్ణా నదిలో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. అయితే, నీటిలో ఉన్న ఓ మొసలి మహిళలపై దాడి చేసింది.

ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒడ్డుకు వచ్చిన మొసలి మెడకు ఉచ్చు వేసి బంధించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామస్తులపై మొసలి దాడి చేయటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement