'ఇలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోం' | bjp leaders takes on tdp leaders | Sakshi
Sakshi News home page

'ఇలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోం'

Jul 3 2016 2:11 PM | Updated on Mar 28 2019 8:37 PM

దేవాలయాల తొలగింపుపై టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.

విజయవాడ : దేవాలయాల తొలగింపుపై టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో ఈ ఇరువురు నేతలు మాట్లాడారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... దేవాలయాల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధర్మకర్తలను సైతం టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాళ్ల వ్యాపారాలపై దాడులు చేస్తామని భయపెడుతున్నారని విమర్శించారు.

ఇలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ధర్మకర్తలు, పీఠాధిపతులతో చర్చించకుండా ఇలా వ్యవహరించడం తగదని టీడీపీ నేతలకు సోము వీర్రాజు హితవు పలికారు. మరో నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నిరంకుశంగా ఆలయాలను కూల్చారని మండిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు, విగ్రహాలను ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు, దేవత విగ్రహాలను ప్రొక్లెయినర్లతో కూల్చి ముక్కలు చేయడం దారుణమైన చర్యగా కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement