'హైదరాబాద్ కు 100బస్సులు నడిపిస్తాం' | 'Allocation of 100 buses to Hyderabad' | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ కు 100బస్సులు నడిపిస్తాం'

Jan 11 2016 12:29 PM | Updated on Sep 3 2017 3:29 PM

ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 100 సర్వీసులను నడిపిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.

కరీంనగర్ లో ఆర్టీసీ సిటీ సర్వీసులను తెలంగాణ మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్  ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 500 బస్సులను కొనుగోలు చేయనుందని ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు భారీగా సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. దీని కోసం 100 బస్సులను కేటాయించనున్నట్లు తెలియజేశారు.


ఆర్టీసీ పేద ప్రజల ఆస్తి అని మరో మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంస్థను వ్యాపార సంస్థగా భావించి.. లాభాల బాటలోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని అన్ని రంగాల్లో ఆదుకోడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగాఉంటుందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement