విషాదం: యువతి, యువకుడు ఆత్మహత్య

Young man And young woman Commits Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ :  ఇంట్లో ఎవరులేని సమయంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఖైరతాబాద్ సీబీఐ క్వార్టర్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. వర్షశ్రీ(22), మహేశ్వర రెడ్డి(25)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేష్‌ ఉరివేసుకోగా, యువతి కిటికీకి బట్ట బిగించుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబ సభ్యులు అందరూ బంధువుల పెళ్లికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top