విషం తాగిన ఎస్‌ఐ కుమార్తె

SI Daughter Drink Poison in Tamil Nadu - Sakshi

చెన్నై ,అన్నానగర్‌: విషం తాగిన ఓ యువతి  పోలీసుస్టేషన్‌కు వచ్చి కలకలం రేపింది. ఈ సంఘటన  ఆదివారం చోటుచేసుకుంది.  నెల్‌లై జిల్లా పాలై పోలీసుస్టేషన్‌కి ఆదివారం ఉదయం 20 ఏళ్ల యువతి తచ్చాడుతూ వచ్చింది. పోలీసులు యువతి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ యువతి తాను ఎస్‌ ఐ కూతురని,  బతకడం ఇష్టం లేదని చెప్పింది.   నాన్న ఎప్పుడూ తిడుతూ ఉంటాడని, చనిపోవాలనుకున్నానని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.   యువతి నోటి నుంచి విషం వాసన రావడంతో  పోలీసులు జీపులో ఎక్కించుకుని నెల్‌లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.  యువతి తండ్రికి పోలీసులు సమాచారం అందించారు. పోలీసుస్టేషన్‌లో కలకలం రేపిన ఆ యువతి పేరు,  వివరాలు పోలీసులు రహస్యంగా ఉంచారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top