అనుమానంతో దాడి.. యువకుడు మృతి

People Attacks Two Bihar People In chennai - Sakshi

సాక్షి, చెన్నై : దేశవ్యాప్తంగా కొందరు పిల్లలను ఎత్తుకెలుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రజలు అనుమానంతో కొందరిపై దాడులు చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధమైన ఘటన  చెన్నైలో చోటు చేసుకుంది. 

హోసూరు శివారు ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారనే అనుమానంతో ప్రజలు ఇద్దరు బీహర్‌ యువకులను చితకబాదారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడ్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top