తిరస్కరించిందనే కోపంతో క్రూరంగా.. | Odisha Teenager Set Ablaze By Classmate Dead | Sakshi
Sakshi News home page

క్లాస్‌మేట్‌పై డిప్లొమా విద్యార్థి దారుణం

Jun 10 2019 7:10 PM | Updated on Jun 10 2019 7:12 PM

Odisha Teenager Set Ablaze By Classmate Dead - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌ : తన క్రూరవాంఛను తిరస్కరించిందనే కోపంతో టీనేజర్‌ను హతమార్చాడో కసాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన క్లాస్‌మేట్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కోరాపూట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... బాధితురాలు(17) సెమిలిగూడలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో డిప్లొమా చదువుతోంది. ఈ క్రమంలో గోపీనాథ్‌ ఖరా(18)  కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలంటూ మానసిక వేదనకు గురిచేసేవాడు. ఇందుకు బాధితురాలు తిరస్కరించడంతో కక్షగట్టిన.. గోపీనాథ్‌ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగా గత నెల 31న ఎవరూలేని సమయంలో బాధితురాలి ఇంట్లో చొరబడిన గోపీనాథ్‌.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గత పదిరోజులుగా కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతిచెందింది. దీంతో గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement