కూతురిని అమ్మేసి.. ఆపై కట్టుకథ..

Mother Held For Selling Daughter For Money In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి రెండేళ్ల కూతురిని 20వేలకు అమ్మేసింది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. ఆ పాపను కొందరు బ్రోకర్లు ఓ ఎంపీటీసీ భర్తకు రూ. 80వేలకు అమ్మారు.

భర్త కొడతాడనే భయంతో ఓ కట్టుకథ చెప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఆ మహిళ భర్తకు చెప్పి బోరున ఏడ్చింది. దీం అతను వెంటనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top