సూపర్‌ వాస్మల్‌ తాగి వ్యక్తి ఆత్మహత్య  

Man Suicide With Family Conflicts - Sakshi

గూడూరు: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సూపర్‌ వాస్మల్‌ 33 అనే తైలం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గూడూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడివయ్యకాలనీలో ఉన్న హిందూశ్మశాన వాటిక షెల్టర్‌లో మంగళవారం వెలుగుచూసింది. రెండో పట్టణ ఎస్సై హుస్సేన్‌బాషా సమాచారం మేరకు..

ఒకటో పట్టణంలోని ఐసీఎస్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన యనమల మురళి (35) కుటుంబ కలహాలతో మద్యంలో వాస్మల్‌ కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు మంగళవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.   మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top