హైదరాబాద్‌ జంట పేలుళ్లకు 11 ఏళ్లు | Lumbini Park Gokul Chat Blast Completed 11 Years | Sakshi
Sakshi News home page

Aug 25 2018 1:00 PM | Updated on Sep 4 2018 5:44 PM

Lumbini Park Gokul Chat Blast Completed 11 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 41 మందిని బలితీసుకున్న హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. 2007, ఆగస్టు 25న లుంబిని పార్కు, గోకుల్‌ చాట్‌లో సంభవించిన జంట పేలుళ్లు ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయి. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు.  ఈ పేలుళ్ల కేసుకు సంబంధించిన తుది తీర్పును ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు సోమవారం(ఆగస్టు 27) వెలువరించనుంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఈ ఉగ్రదాడి జరిగి పదకొండేళ్లయినా బాధిత కుటుంబాలను మాత్రం వాటి ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోఠి గోకుల్‌ చాట్‌ వద్ద నివాళులర్పించిన బాధిత కుటుంబాలు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నామని... దీంతో ఆర్ధికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement