అమానుష ఘటనపై సర్కారు సీరియస్‌ | Government is serious about the atrocity in Eluru | Sakshi
Sakshi News home page

అమానుష ఘటనపై సర్కారు సీరియస్‌

Jan 9 2020 4:54 AM | Updated on Jan 9 2020 5:01 AM

Government is serious about the atrocity in Eluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఏలూరు టౌన్‌: ఏలూరులో సామూహిక లైంగిక దాడికి గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.సూయిజ్‌తో కలిసి ఘటనపై బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అమానుష ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. కాగా, మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి అమరావతి వీధుల్లో ధర్నాలు చేయించడమే పౌరుషమా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బుధవారం ఏలూరులో ఆమె మాట్లాడుతూ రాజధాని అంశంపై చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement