శంకరమఠంలో దొంగతనం.. ఇంటి దొంగల పనేనా..!

Gold Ornaments Missing In Nallakunta Shankar Matham - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైన శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రమైన నల్లకుంటలోని శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇది ఇంటి దొంగల పనే కావొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకునే బంగారు అభరణాలు భద్రపరిచే గదినుంచి కొన్ని వారాల క్రితమే మాయమైనట్టు మఠం అధికారులు వెల్లడించారు. ఇద్దరు క్లర్కు స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్‌, సాయిని తొలగించామని తెలిపారు. అయితే, ఈ విషయం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి దృష్టికి వెళ్లడంతో.. వారి ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. సాయి అనే ఉద్యోగిని నల్లకుంట పోలీసులు శనివారం విచారించనున్నట్టు సమాచారం.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top