ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Father and Son Arrest In Murder Case - Sakshi

తండ్రి, కుమారుడి అరెస్ట్‌

సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన నామక్కల్‌ జిల్లా కుమార పాళయంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. నామక్కల్‌ జిల్లా కుమార పాళయం సమీపం కోట్టైమేడు ప్రాంతానికి చెందిన ఆర్ముగం(43). ఇతని భార్య నాగమ్మాళ్‌. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్ముగం పక్క ఇంట్లో నివశిస్తున్న కన్నియప్పన్‌(45), అతని భార్య మరకదం(35). వీరి కుమారుడు గౌరిశంకర్‌(22). ఇలాఉండగా మరకదంకు ఆర్ముగంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు ఏర్పడేవి. ఈ స్థితిలో మూడు రోజుల కిందట ఆర్ముగం, మరకదం గదిలో ఏకాంతంగా ఉండగా గౌరిశంకర్‌ చూశాడు.

దీంతో ఆవేదన చెందిన గౌరిశంకర్‌ తండ్రితో చెప్పి బోరున విలపించాడు. అనంతరం గౌరిశంఖర్, కన్నియప్పన్‌లు కలిసి ఆర్ముగంను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్ముగం వీధిలో వస్తుండగా ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న కుమారపాళయం పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్ముగం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కుమార పాళయం జీహెచ్‌కు తరలించారు. గౌరిశంఖర్, కన్నియప్పన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top