హత్య కేసులో ఆర్మీ మేజర్‌ అరెస్ట్‌ | Delhi Police arrests Major accused in murder of Army officer's wife | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఆర్మీ మేజర్‌ అరెస్ట్‌

Jun 25 2018 5:36 AM | Updated on Aug 20 2018 4:27 PM

Delhi Police arrests Major accused in murder of Army officer's wife - Sakshi

న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలో జరిగిన ఆర్మీ మేజర్‌ భార్య హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆదివారం మరో మేజర్‌ను మీరట్‌లో అరెస్ట్‌ చేశారు. నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో పనిచేస్తున్న మేజర్‌ నిఖిల్‌ హందాకు అక్కడే పనిచేస్తున్న మరో మేజర్‌ అమిత్‌ ద్వివేదీ భార్య శైలజాతో పరిచయం ఏర్పడింది. ఇటీవల అమిత్‌కు బదిలీ కావటంతో భర్తతో పాటే శైలజా ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ఏరియాలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన నిఖిల్‌.. ఆస్పత్రికి వెళ్లిన శైలజాను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అరగంట తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉందని పోలీసులకు సమాచారమందింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం మీరట్‌లో ఉన్న మేజర్‌ నిఖిల్‌ హందాను అరెస్ట్‌ చేశారు. ఆమెను గొంతుకోసి చంపిన అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించటానికి నిఖిల్‌ కారుతో తొక్కించాడని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement